నాసా పోటీల్లో భారత 'స్క్రూ డ్రైవర్స్'

25 Jun, 2016 22:24 IST|Sakshi
నాసా పోటీల్లో భారత 'స్క్రూ డ్రైవర్స్'

హ్యూస్టన్ః అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ (నాసా)  ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక పోటీల్లో భారత విద్యార్థులు పాల్గొన్నారు. ముంబై లోని ముఖేశ్ పటేల్ సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న 13 మంది విద్యార్థుల బృందం పోటీకి ఎంపికైంది.  ప్రపంచంలోని మొత్తం 40 బృందాలతో ముంబై 'స్క్రూ డ్రైవర్స్' టీమ్ తలపడుతోంది. హ్యూస్టన్ లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు.. మారుమూల ప్రాంతాలనుంచి సందేశాలను అందుకొనే సామర్థ్యం గలవాహనాలను రూపొందిస్తున్నారు. వాహనాలను తయారు చేసేందుకు వ్యర్థాలను వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు