చమురు క్షేత్రంలో అగ్ని ప్రమాదం, 30 మంది గల్లంతు

6 Dec, 2015 10:28 IST|Sakshi

బాకు: కాస్పియన్ సముద్రంలోని అజర్బైజాన్ దేశ చమురు సంస్థ సోకార్కు చెందిన చమురు క్షేత్రంలో అగ్ని ప్రమాదం జిరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మరో 30 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో గునెష్లీ ఆయిల్ ఫీల్డ్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదం జరిగిన అనంతరం సహాయక సింబ్బంది 33 మందిని కాపాడారు. కాగా మిగిలిన వారి ఆచూకీ లభించడం లేదు.

అంతర్గత గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడం ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా గల్లంతైన వారికోసం సహాయక సింబ్బంది చేపడుతున్న గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు