మావల్లే సాధ్యమైంది: ఒబామా

20 Dec, 2015 04:09 IST|Sakshi

వాషింగ్టన్: చారిత్రక పారిస్ ఒప్పందం పరిధిలోకి ప్రపంచంలోనే పెద్దవైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా, చైనా దేశాలను తీసుకురావడం ఈ ఏడాదిలో తన అతిపెద్ద విజయమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. గతవారం పారిస్‌లో దాదాపు 200 దేశాలు దీనిపై సంతకం చేయడం కేవలం అమెరికా నాయకత్వంలోనే సాధ్యపడిందని శుక్రవారం వైట్ హోస్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు