బుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024
జలపాతంలో పడి ఇద్దరు మృతి కొరాపుట్: జిల్లాలోని పొట్టంగి సమితి సమీపంలో గాలిగబ్దర్ జలపాతంలో జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని పీహెచ్డీ కాలనీకి చెందిన ఆశిష్ కుమార్ పండా (24), జన్నిగుడకి చెందిన నిత్యేష్ కుమార్ దాస్ (24)లు స్నానానికి జలపాతం వద్దకి వెళ్లారు. అక్కడ వారు జలపాతంలో జారిపడి మృతి చెందారు. అగ్నిమాపక బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రాంతంలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 17 నుంచి ఉత్సవాలు రాయగడ: స్థానిక ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటూ భైరవీధిలో కొలువైన బురదల పోలమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు జూన్ 17 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటుగా నిర్వహించనున్న ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. కమిటీ అధ్యక్షుడిగా పతివాడ శ్రీనివాస్రావు, వర్కింగ్ ప్రెసిడెంటుగా కింతలి శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షుడిగా ఎద్దు శ్రీహరి, కార్యదర్శిగా బార్జి శేషగిరి, కోశాధికారిగా బి.సర్వేశ్వరరావులు నియమితులయ్యారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని కమిటీ అధ్యక్షుడు పతివాడ శ్రీనివాస్రావు తెలియజేశారు.
సురక్షితంగా చేరిన పోలింగ్ సిబ్బంది భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం శాంతియుతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కొండకోన ప్రాంతాల్లో సైతం పోలింగ్ సౌకర్యాలు కల్పించారు. ఆయా ప్రాంతాలకు అనుబంధ యంత్రాంగం లాంచి, హెలికాఫ్టర్ వంటి వాహనాల్లో చేరి పోలింగు ప్రక్రియ విజయవంతం చేశారు. వీరంతా సురక్షితంగా గమ్యం చేరినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం వర్గాలు తెలిపాయి.
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు బరంపురం: గంజాం జిల్లాలో తొలి విడత పోలింగ్ అనంతరం ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య స్థానిక ఐఐటీ ఇన్స్టిట్యూట్లోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండడంతో అప్పటివరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలు పురస్కరించుకుని పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ప్రధానంగా దక్షిణ ఒడిశా పరిధిలో దళిత ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఇక్కడ బిజూ జనతా దళ్ తన పూర్వ వైభవం చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి బీజేడీకి భంగపాటు తప్పదని బీజేపీ చెబుతోంది. తొలిదశలో 4 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అనుబంధ 28 శాసనసభ స్థానాల్లో పోలింగ్ పూర్తయ్యింది. 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కలహండి, కొరాపుట్లు మాత్రం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మిగిలిన 2 స్థానాలు బరంపురం, నవరంగ్పూర్ నుంచి బీజేడీ వరుసగా 3 సార్లు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికల్లోనూ ఈ రెండు స్థానాలను కై వసం చేసుకోవడం తథ్యమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. తొలి దశలో ఓటింగ్ జరిగిన 28 అసెంబ్లీ స్థానాల్లో 2019లో బీజేడీ 20 సీట్లు (71 శాతం) గెలుచుకోగా, 4 సీట్లు (14 శాతం) బీజేపీ, 3 సీట్లు కాంగ్రెస్ (10.71 శాతం), 1 స్వతంత్ర అభ్యర్థి చేజిక్కించుకున్నారు.
కలహండి కింగ్ ఎవరో..?
కలహండి లోక్సభ ఒక స్వింగ్ స్థానం. 2009లో కలహండి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2014లో బీజేడీ గెలిచింది మరియు 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీ, బీజేడీ మధ్య ప్రధాన పోరు కనిపిస్తోంది. కలహండి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, 5 సీట్లు బీజేడీ 2019లో గెలుచుకుంది. వీటిలో ధరమ్గఢ్, జునాగఢ్, లంజిగఢ్, నొర్లా మరియు నువాపడా ఉన్నాయి. మిగిలిన 2 స్థానాలను కాంగ్రెసు, బీజేపీ
చెరొకటి కై వసం చేసుకున్నాయి. ఖరియార్లో కాంగ్రెస్, భవానీపట్న అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నాయి. కలహండి లోక్సభ స్థానం పట్ల ఉత్కంఠ బిగుసుకుని ఉంది. ఈసారి బీజేపీ, బీజేడీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ స్థానం చేజిక్కించుకోవడం ఉభయ పక్షాలు ప్రతిష్టాత్మంగా పరిగణిస్తున్నాయి.
ఆసక్తికరంగా కొరాపుట్
కొరాపుట్ లోక్సభ స్థానం గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. 1972 నుంచి 1998 వరకు గిరిధర్ గొమాంగో వరుసగా 8 సార్లు గెలిచారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఆయన భార్య హేమా గొమాంగో గెలిపొందగా, 2004లో గిరిధర్ గొమాంగో మళ్లీ గెలిపొందారు. 2009 మరియు 2014లో బీజేడీ వరుసగా 2 సార్లు ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 2019లో కాంగ్రెస్కు చెందిన సప్తగిరి ఉలాకా విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్, బీజేడీ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. 2019లో కొరాపుట్ లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019లో బీజేడీ 5, కాంగ్రెస్ 1 మరియు 1 స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. బిసంకటక్, గుణుపురం, కొరాపుట్, లక్ష్మీపూర్, పొట్టంగి అసెంబ్లీ స్థానాలను బీజేడీ గెలుచుకుంది. జయపురం నుంచి కాంగ్రెస్, రాయగడ నుంచి స్వతంత్రులు గెలిపొందారు.
మళ్లీ బీజేడీ
కై వసమేనా..?
సోమవారం ముగిసిన తొలి విడత పోలింగ్లో మిగతా 2 లోక్సభ స్థానాలు బరంపురం, నవరంగపూర్ స్థానాల్లో బిజూ జనతా దళ్ 2009 నుంచి వరుసగా 3 సార్లు విజేతగా నిలిచింది. ఈసారి ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోరాహోరీగా ప్రచారం చేశారు. అంతే కాకుండా నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజేడీ తీరుని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ ప్రభావం తాజా ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీజేపీ వర్గీయులు మాత్రం ఈసారి ఈ 2 స్థానాలు బీజేడీ చేతి నుంచి తమకు దక్కుతాయని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేడీ కూడా తమ పట్టుని సడలించే సత్తా ఏ వర్గానికి లేదని నమ్మకంగా ఉంది.
న్యూస్రీల్ పోలింగ్ సరళిపై ఉత్కంఠ
బీజేడీ, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ
పీఎం మోదీ, సీఎం నవీన్ ప్రభావంపై
ఆసక్తికర చర్చ 2019లో జరిగిన గత ఎన్నికల పోలింగ్ కంటే సోమవారం ముగిసిన తొలి దశ పోలింగ్లో కీలకమైన లోక్సభ స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గింది. బరంపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో గతసారి 65.9 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 63.34 శాతానికి పరిమితం అయింది. కలహండి లోక్స్థానం పరిధిలో పోలింగ్ పరిస్థితి ఇలానే దిగజారినట్లు ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 76.41 శాతం మంది ఓటు వేయగా, ఈసారి పోలింగు 75.71 శాతానికి పరిమితమైన తగ్గుముఖం పట్టింది. మిగిలిన 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు కొరాపుట్ మరియు నవరంగపూర్ ప్రాంతాల్లో గతం కంటే పోలింగు స్వల్పంగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో కొరాపుట్ లోక్సభ స్థానంలో పోలింగ్ 75.34 శాతానికి పరిమితం కాగా, ఈసారి 76.98 శాతానికి పుంజుకుంది. నవరంగపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడ ఈసారి పోలింగ్ ఆశాజనకంగా సాగింది. ఈ ప్రాంతంలో గత సారి పోలింగు 79.52 శాతం రికార్డు కాగా, ఈసారి 80.22 శాతానికి పుంజుకుంది. ఈ 4 లోక్ సభ స్థానాల అనుబంధ 28 అసెంబ్లీ సెగ్మెంట్ల తొలి దశ ఎన్నికల్లో సమగ్ర పోలింగ్ పుంజుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బరంపురం, కలహండి, నవరంగపూర్, కొరాపుట్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 28 శాసన సభ స్థానాల్లో సమగ్ర పోలింగ్ 73.29 శాతానికి పరిమితం కాగా, ఈసారి 73.97 శాతంగా రికార్డు అయింది.