పాక్‌లో సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడి

6 Oct, 2017 05:01 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్తాన్‌ ప్రావిన్సులోని ఫతేపూర్‌లో పీర్‌ రఖేల్‌ షా సూఫీ దర్గాపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఏఎస్సై, కానిస్టేబుల్‌ సహా 18 మంది దుర్మరణం చెందగా, 25 మంది గాయపడ్డారు. దర్గా ప్రధాన ప్రవేశద్వారం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడని డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. దర్గాలను పూజించడం ఇస్లామ్‌కు వ్యతిరేకమంటున్న తాలిబాన్లు ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు