లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య

21 Jan, 2020 04:52 IST|Sakshi

లండన్‌: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్‌లోని స్కాట్లాండ్‌ యార్డ్‌లో ఈ ఘటన జరిగింది.  పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.  29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు