నమస్కార్‌.. బాబ్‌ బిస్వాస్‌ మొదలైంది

25 Jan, 2020 00:29 IST|Sakshi
చిత్రాంగదా సింగ్‌, అభిషేక్‌ బచ్చన్‌

ఎనిమిదేళ్ల క్రితం సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘కహానీ’. ఈ సినిమాలో సస్వతా చటర్జీ చేసిన ‘బాబ్‌ బిస్వాస్‌’ అనే కాంట్రాక్ట్‌ కిల్లర్‌ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ పాత్ర పేరుతో హిందీలో తెరకెక్కుతోన్న సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దియా ఎ. ఘోష్‌ దర్శకురాలు. చిత్రాంగదా సింగ్‌ కథానాయికగా నటిస్తారట. షారుక్‌ ఖాన్, గౌరీ ఖాన్‌ (షారుక్‌ ఖాన్‌ భార్య), సుజోయ్‌ ఘోష్,  గౌరవ్‌ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ కోల్‌కతాలో మొదలైంది. ‘‘లైట్స్‌... కెమెరా.. నమస్కార్‌.. ‘బాబ్‌ బిస్వాస్‌’ షూటింగ్‌లో తొలి రోజు పాల్గొన్నాను’’ అన్నారు అభిషేక్‌ బచ్చన్‌. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

మరిన్ని వార్తలు