లావణ్యా ఐఏయస్‌

7 Mar, 2020 05:43 IST|Sakshi
లావణ్యా త్రిపాఠి

లావణ్యా త్రిపాఠికి రెండు తమిళ సినిమాలు చేసిన అనుభవం ఉంది. 2014లో వచ్చిన ‘బ్రహ్మమ్‌’, 2017లో వచ్చిన ‘మాయవాన్‌’ సినిమాల్లో నటించారామె. తాజాగా మూడో తమిళ సినిమా కమిటయ్యారు. అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా లావణ్యా త్రిపాఠి నటించనున్నారు. ఈ సినిమాలో  ఐఏయస్‌ కావాలనుకునే అమ్మాయిగా కనిపిస్తారట లావణ్య. ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా, కథను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో అథర్వ పోలీస్‌  కాని స్టేబుల్‌గా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు