ట్రాక్‌లోనే ఉన్నాం

27 May, 2019 05:35 IST|Sakshi
డేనియల్‌ క్రెగ్‌

జేమ్స్‌బాండ్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది. బాండ్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా థియేటర్స్‌కు క్యూ కడతారు. అందుకే బాండ్‌ 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో ఉన్నారు టీమ్‌. క్యారీ జోజి ఫుకునాగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాండ్‌గా డేనియల్‌ క్రెగ్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ జమైకాలో ప్రారంభమైంది. ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా డేనియల్‌ క్రెగ్‌ గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమేనని టీమ్‌ ధృవీకరించింది. ‘‘క్రేగ్‌ గాయపడ్డ మాట నిజమే. ఆయన చీలమండల గాయంతో బాధపడుతున్నారు. సర్జరీ జరగాల్సి ఉంది. ఈ ట్రీట్‌మెంట్‌ తర్వాత రెండు వారాలు ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి సెట్‌లో జాయిన్‌ అవుతారు. రిలీజ్‌ విషయంలో ఏ మార్పు లేదు. ట్రాక్‌లోనే ఉన్నాం. ముందు చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్‌లోనే రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

మరిన్ని వార్తలు