200 కోట్ల బడ్జెట్‌.. పది దేశాల్లో షూటింగ్‌..!

18 Aug, 2018 12:58 IST|Sakshi

భారతీయ చిత్రాలు విదేశాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన దర్శక నిర్మాతలు బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే  పద్మావత్‌, తగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌, టైగర్‌ జిందాహై లాంటి చిత్రాలకు 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.. చేస్తున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో మరో భారీ చిత్రం చేరనుంది. బాలీవుడ్ యాక్షన్‌ స్టార్స్‌ హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ల కాంబినేషన్‌లో యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ తెరకెక్కనుంది. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు 10 దేశాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. హృతిక్‌ హీరోగా బ్యాంగ్‌ బ్యాంగ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి ఫొటోనూ చిత్ర హీరోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మరిన్ని వార్తలు