గిలిగింతలు పెట్టే ప్రేమ

30 Oct, 2015 23:17 IST|Sakshi
గిలిగింతలు పెట్టే ప్రేమ

హారర్ నేపథ్యంలో సాగే ప్రేమకథతో  తెరకెక్కుతున్న చిత్రం ‘మనసే మాయ’. సాయికిరణ్, ప్రాచి అధికారి జంటగా ఎం. బల్వాన్ దర్శకత్వంలో సునీల్‌సాగర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గిలిగింతలు పెట్టే ప్రేమకథతో పాటు ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే థ్రిల్లింగ్, హారర్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఇందులో ఉన్న ఏడు పాటల్లో మూడు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో మిగతా నాలుగు పాటలను పూర్తి చేస్తాం. డిసెంబరులో పాటలను, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.కె.మజ్నూ, ఛాయాగ్రహణం: ప్రసాద్, సహ-నిర్మాతలు: ఎం.భాగ్యలక్ష్మి, కె.ఫిష్‌లక్ష్మి.

>