నాడు.. నేడు ‘మన దేశం’తోనే!

6 Jul, 2018 00:57 IST|Sakshi
బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావుపై రూపొందుతోన్న బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’. వారాహి చలన చిత్రం అండ్‌ విబ్రీ మీడియా సమర్పణలో ఎన్టీఆర్‌ తనయుడు, నటుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్నారు. జాగర్లమూడి రాధకృష్ణ (క్రిష్‌) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ గురువారం మొదలైంది. 1949లో జూలై 5నే ఎన్టీఆర్‌ ‘మన దేశం’ సినిమాను స్టార్ట్‌ చేశారు.

‘‘నాడు, నేడు ‘మన దేశం’తోనే చరిత్రకు శ్రీకారం.. తెలుగువారందరి ఆశీస్సులు కోరుతూ’’ అంటూ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే ‘అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్లే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు.. 27.8.75’’ అంటూ 1975లో ఎన్టీఆర్‌ స్వయంగా రాసిన ఓ లేఖను బాలకృష్ణ లుక్‌తో పాటుగా చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు.

మరిన్ని వార్తలు