‘పడి పడి లేచే మనసు’ షూటింగ్‌ పూర్తి!

22 Oct, 2018 19:12 IST|Sakshi

యంగ్‌ హీరో శర్వానంద్‌, ‘ఫిదా’ భామ సాయి పల్లవి జంటగా ‘పడి పడి లేచే మనసు’ అనే చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శర్వానంద్‌, సాయి పల్లవి కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్‌ కానుందని తెలుస్తోంది. 

తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకున్నట్లు సమాచారం. చిత్రయూనిట్‌ అంతా కలిసి దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రేమ కథలను అందంగా తెరకెక్కించే హను రాఘవపూడి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానున్న విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు