రకుల్‌ ఎటాక్‌

23 Nov, 2019 00:24 IST|Sakshi
రకుల్‌ప్రీత్‌ సింగ్‌

బాలీవుడ్‌పై హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ‘ఎటాక్‌’ చేసినట్లున్నారు. వరుస అవకాశాలను ఖాతాలో వేసుకుంటూ బాలీవుడ్‌లో కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దేదే ప్యార్‌ దే, మర్జావాన్‌ చిత్రాల్లో హిందీ తెరపై కనిపించారు. ఇటీవల అర్జున్‌ కపూర్‌ సరసన ఓ సినిమా అంగీకరించారు. ఇప్పుడు జాన్‌ అబ్రహాం హీరోగా హిందీలో తెరకెక్కనున్న ‘ఎటాక్‌’ సినిమాకి సైన్‌ చేశారు. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రకుల్‌ ఓ కథానాయికగా నటించనున్నారు. మరో నాయికగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటిస్తారు. ‘‘మంచి స్క్రిప్ట్‌ కుదిరింది. జాన్‌తో మరోసారి నటించబోతున్నందుకు సంతోషంగా ఉంది. రకుల్‌ది కూడా చాలా మంచి పాత్ర’’ అని జాక్వెలిన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు