ఆ మూవీలో రష్మికకు భారీ రెమ్యూనరేషన్‌

29 May, 2019 08:14 IST|Sakshi

హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌ స్ధాయికి చేరుకుంటున్న రష్మిక మందానా తన పారితోషికాన్ని అమాంతం పెంచేశారు. డియర్‌ కామ్రేడ్‌లో ఆమె రూ 80 లక్షలు పారితోషికంగా అందుకుంటున్నట్టు సమాచారం. ఆమె చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉండటంతో త్వరలోనే రెమ్యూనరేషన్‌ను మరింత డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో రష్మిక మందానా త్వరలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ల సరసన చేరనుంది.

ఛలో మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మికకు గీత గోవిందంతో బ్లాక్‌బస్టర్‌ లభించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన డియర్‌ కామ్రేడ్‌ విడుదల కోసం వేచిచూస్తున్నారు. హిట్‌ జోడీగా వారికి పేరుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలో కూడా రష్మిక అభిమానులకు కనువిందు చేయనున్నారు.

మరిన్ని వార్తలు