అయ్య బాబోయ్‌ అసలు కలెక్షన్లు ఆగట్లా..

19 Jan, 2020 17:18 IST|Sakshi

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’  చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్‌లో ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్‌ వసూలు చేసిందని ప్రకటించింది. అలాగే కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. 

అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రోమోలను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ఒకదానిలో ప్రకాశ్‌ రాజ్‌తో మహేష్‌ అయ్య బాబోయ్‌.. ఫ్లో ఆగట్లేదని పలికే సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌.. ‘అయ్య బాబోయ్‌ అసలు కలెలక్షన్లు ఆగట్లా..’ అని పేర్కొంది. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, సంగీత కీలక పాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు