‘రణరంగం’ వాయిదా పడనుందా?

13 Jul, 2019 15:18 IST|Sakshi

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ డ్రామా రణరంగం. శర్వ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ విషయంలోనూ చాలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కావటం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదా పడటం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల శర్వానంద్‌ గాయపడటంతో షూటింగ్ కు బ్రేక్‌ పడింది. దీంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. శర్వానంద్ సరసన కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్‌లు హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.

మరిన్ని వార్తలు