దారుణం: బాలికపై తాత, తండ్రి అఘాయిత్యం

23 Jul, 2020 14:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: సమాజంలో మానవత్వ విలువలు మంట కలిసి పోతున్నాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన నాన్నే కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే దారుణమనుకుంటే తండ్రితో పాటు ఒడిలో పెట్టుకొని ఆడించాల్సిన తాత కూడా ఆమెను శరీరకంగా హింసించాడు. ఈ కారణంగా 15 ఏళ్ల ఒక బాలిక గర్భవతి అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటు చేసుకుంది. 

చదవండి: తల్లితో సహజీవనం.. కుమార్తెపై

బాలిక తల్లి మరణించినప్పటి నుంచి ఆమె తండ్రి, తాతలు బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడుతున్నారని ఆమె అత్త న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాత, తండ్రిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలిక గర్భవతి కావడంతో దీనిపై విచారించిన కోర్టు బాలిక ప్రెగ్నెన్సీని తొలగించడానికి అనుమతినించింది. సాధారణంగా 20 వారాల ప్రగ్నెన్సీని మాత్రమే తొలగిస్తారు. కానీ బాలికకు ప్రస్తుతం 25 వారాలు. దీంతో వైద్య పరంగా అన్ని పరిస్థితులను పరిశీలించిన న్యాయస్థానం వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రెగ్నన్సీని తొలగించాలని ఆదేశించింది. కొన్ని అసాధారణమైన పరిస్థితిలో న్యాయంస్థానం బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాలిక ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లకుండా ఇలాంటి తీర్పులు ఇవ్వచ్చని న్యాయం స్థానం పేర్కొంది. 

చదవండి: బాలికపై అత్యాచారం

>
మరిన్ని వార్తలు