ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి

8 May, 2019 08:39 IST|Sakshi

దంతేవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అరణ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టుతోపాటూ, మరోకరు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఒక ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తోపాటూ, 12 బోర్ గన్‌లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు