జమ్మూ కశ్మీర్‌లో భారీ వరదలు

20 Jul, 2017 11:37 IST|Sakshi
- ఆరుగురి మృతి
జమ్మూ కశ్మీర్‌:  రాష్ట్రంలోని దోడా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని తాంత్రి గ్రామంలో అకస్మాత్తుగా మెరుపు వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరిని పోలీసులు కాపాడారు. వరదల వల్ల పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు.
>
మరిన్ని వార్తలు