మోదీ,పారికర్ ను చంపేస్తాం- ఐఎస్ఐఎస్

19 Jan, 2016 18:08 IST|Sakshi
మోదీ,పారికర్ ను చంపేస్తాం- ఐఎస్ఐఎస్

పనాజి:   భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది, రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్లను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్  పేరుతో  వచ్చిన ఓ లేఖ ఉద్రిక్తతను రాజేసింది.   గత వారం గోవా రాష్ట్ర సెక్రటేరియట్కు  ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ సంస్థ)  పేరుతో ఈ లేఖ వచ్చినట్లు రాష్ట్ర నిఘా విభాగం  చెబుతోంది.  దాంతో పోలీస్ బలగాలను, భదతా దళాలను అప్రమత్తం చేసింది.  ఐఎస్ఐఎస్ అని సంతకం చేసి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కార్డు కాపీని యాంటీ  టెర్రరిస్టు స్క్వాడ్   అన్ని పోలీస్  స్టేషన్లకు  పంపింది.

కాగా నరేంద్ర మోది, పారేకర్లను చంపేస్తామంటూ  తమ కు ఒక లేఖ  చేరిందని  గోవా  పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.  ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్  స్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు.   పోస్ట్ కార్డ్ పై సంతకం మాత్రమే ఉన్న  ఈ లేఖలో గోవధ నిషేధంపై  ఆగ్రహం వ్యక్తం చేశారని, అయితే ఎవరు రాశారనే వివరాలేవీ ఆ లేఖలో లేవని పేర్కొన్నారు.  దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు  నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు