షాహీ బావర్చి యజమానిపై బీజేపీ కార్పొరేటర్‌ దాడి

14 Aug, 2018 17:44 IST|Sakshi

ముంబై : ముంబైలోని ఖర్గర్‌కు చెందిన బీజేపీ కార్పోరేటర్‌ శత్రుఘన్‌ కాకడే ఓ హోటల్‌ యజమానిపై దాడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. సెక్టర్‌ 4లో కొత్తగా ప్రారంభించిన షాహీ బావర్చి హోటల్‌ యజమానిని ప్రతి నెల రూ.50 వేలు కట్టాల్సిందిగా కాకడే అక్రమవసూళ్లకు పాల్పడ్డారు. దీనికి నిరాకరించినందుకు హోటల్‌ యజమాని ఇంథియాజ్‌ షేక్‌(41)పై కాకడే, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయాలైన హోటల్‌ యజమానిని కమోతేలోని మహాత్మాగాంధీ మిషన్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

అక్రమవసూళ్లకు తాను నిరాకరించడంతో హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో తొలుత కార్పొరేటర్‌ అనచరులందరూ కలిసి ఉద్దేశపూర్వకంగానే కొట్లాట సృష్టించి, మూకమ్మడిగా హోటల్‌పై దాడి చేశారని ఇంథియాజ్‌ తెలిపారు. గత శుక్రవారం రాత్రి 10 గంటకు చోటు చేసుకున్న ఈ సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాకడే, దాడిలో పాల్గొన్న ఆయన అనుచరుల ఆచూకీ లభించడంలేదని సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ టైడార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు