మోదీజీ...విడి సిగరెట్లను నిషేధించండి

4 Dec, 2014 20:01 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్యాన్సర్ బారి నుంచి బయటపడిన మాజీ కస్టమ్స్ కమిషనర్ కుమార్ లేఖ రాశారు. విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఆయన గురువారం మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు 2008లో క్యాన్సర్ సోకినట్లు గుర్తించారని, తన స్వరపేటికతో పాటు నాలుకను కూడా సగం తొలగించారని కుమార్ తన లేఖలో కోరారు.

క్యాన్సర్ వల్ల ఆహారం తీసుకోవడం, మాట్లాడం తనకు ఇప్పుడు అతి పెద్ద సవాల్గా మారిందని, మరో వ్యక్తికి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే విడిగా సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలని కుమార్ లేఖలో పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు