న్యూఢిల్లీ: కేంద్ర హోమియోపతి మండలి (సీసీహెచ్) అధ్యక్షుడు రామ్జీ సింగ్ను లంచం ఆరోపణలపై సీబీఐ అరెస్టు చేసింది. గుజరాత్లోని ఆర్కే వర్సిటీ హోమియోపతి కాలేజీ స్థాపించేందుకు అనుమతుల కోసం రామ్జీ సింగ్కు లంచం ఇవ్వజూపింది. ఒక మధ్యవర్తి ద్వారా రాయబారం నడిపింది. ఒక హవాలా వ్యాపారి నుంచి మధ్యవర్తి రూ.20 లక్షలు (మొత్తం ఒప్పందంలో ఇది కొంత మాత్రమే) తీసుకుంటుండగా సీబీఐ అతణ్ని అరెస్టు చేసింది.