మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా....

4 Aug, 2014 11:39 IST|Sakshi
మంత్రిగారు మామూలు ప్రయాణికుడిలా....

కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మంత్రిగా స్పెషల్ హోదాని ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించడం ఇప్పుడు వార్త అయింది.


మంత్రిగా ఆయనకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఓ ప్రత్యేక వాహనంలో ఆయన్ను విమానం దగ్గరకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు ఉంటాయి. కానీ అశోక్ గజపతి రాజు వాటిని పక్కనపెట్టి, మిగతా ప్రయాణికులలాగా బస్సులో విమానం వద్దకు రావడం, క్యూలో నిలుచోవడం చేస్తున్నారు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ లేదు. ఏ విమానయాన శాఖ మంత్రీ ఇలాచేయలేదు.


మంత్రులు, ఎంపీల వల్ల విమానాలు ఆలస్యం కావడం మామూలైపోయిన ఈ రోజుల్లో విమానయాన శాఖ మంత్రి వ్యవహార శైలి ఇప్పడు ఇది హాట్ టాపిక్ అయి కూచుంది.

మరిన్ని వార్తలు