పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం

7 Mar, 2016 16:02 IST|Sakshi

మెయిన్ పురి: కూతురి పెళ్లి వేడుక ఆ తండ్రి పాలిట మృత్యుపాశంగా మారింది. కుమార్తె వివాహ వేడుకలో అంతవరకు ఉత్సాహంగా పాల్గొన్న కన్నతండ్రిని మృతువు బుల్లెట్ రూపంలో కబళించింది. ఈ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ లోని భొగావ్ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది.

కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్(45) తన కుమార్తె పెళ్లి వేడుకలో బుల్లెట్ గాయంతో ప్రాణాలు కోల్పోయాడు. వేడుకల్లో భాగంగా తుపాకీతో కాల్పులు జరపడంతో అతడికి బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

బదౌన్ జిల్లాలో పనిచేస్తున్న రాజేంద్ర సింగ్ తన కుమార్తె పెళ్లి కోసం భొగావ్ కు వచ్చాడని ఎస్పీ హనుమన్షు కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

మరిన్ని వార్తలు