ఉత్తరాఖండ్‌లో భూకంపం​

14 Jun, 2018 10:01 IST|Sakshi

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో గురువారం వేకువజామున 6 గంటల 12 నిమిషాలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం ఉత్తరకాశి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని 30.8 ఉత్తర అక్షాంశం, 78.2 తూర్పు రేఖాంశాల మధ్య కేంద్రీకృతమైంది. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు