బ్రేకింగ్‌ : ఢిల్లీని వణికించిన భూకంపం

19 Nov, 2019 19:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదైంది. ఇండో నేపాల్‌ సరిహద్దు ప్రాంతం భూకంప కేంద్రంగా నమోదైంది. నేపాల్‌లోని కాప్టాడ్‌ నేషనల్‌ పార్క్‌ వద్ద భూకంప కేంద్రం ఉందని అమెరికా భౌగోళిక సర్వే సంస్థ వెల్లడించింది. కాగా భూప్రకంపనలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు