కుప్వారాలో ఎదురుకాల్పులు.. చిక్కిన ముగ్గురు ఉగ్రవాదులు!

1 Mar, 2019 07:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. హంద్వారా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు చిక్కినట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాదుల క్యాంపులపై భారత మైమానిక దళం మంగళవారం తెల్లవారుజామున మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే షోపియన్‌ జిల్లాలో జరిగిన ఎదుకాల్పులో ఇద్దరు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. 

మరిన్ని వార్తలు