'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి'

27 Dec, 2015 18:20 IST|Sakshi
'నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే.. మప్లర్లే దొరుకుతాయి'

న్యూఢిల్లీ: సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేస్తే.. మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం కంటితడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల రవాణశాఖలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసిన విషయంపై ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ కేసులపై విచారించాల్సిందిగా సీబీఐ అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం సూచిస్తుందని కేజ్రీవాల్‌ అన్నారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి 'మప్లర్‌' ధరించి వెళ్లిన కేజ్రీవాల్‌ ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిరోహించారు.

మరిన్ని వార్తలు