వారం రోజుల్లో నివేదిక సమర్పించండి

8 May, 2017 19:47 IST|Sakshi
వారం రోజుల్లో నివేదిక సమర్పించండి

- కేజ్రీవాల్‌ ముడుపుల వ్యవహారంపై ఏసీబీకి ఎల్జీ అదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా సమర్పించిన ఫిర్యాదును లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ సోమవారం ఏసీబీకి పంపారు. ఏసీబీ ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి వారంరోజుల్లో నివేదిక సమర్పించాలని బైజల్‌ ఆదేశించారు. ఏసీబి ఛీప్‌ మీనా సోమవారం ఢిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ను కలిశారు.

కపిల్‌ మిశ్రా ఆదివారం సాయంత్రం ఎల్జీని కలిసి కేజ్రీవాల్‌ సర్కారు అవినీతిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్‌ గుప్తా, ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సాలతో పాటు బీజేపీ ప్రతినిధి బృందం సోమవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలిసి కపిల్‌ మిశ్రా ఆరోపణలపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు