న్యూఢిల్లీ: లోక్సభ సభ్యులు టీజీ వెంకటేశ్ బాబు (అన్నాడీఎంకే), మీనాక్షి లేఖి (బీజేపీ) , ప్రతాప్ సింహ (బీజేపీ)లను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కు స్పీకర్ సుమిత్రా మహాజన్ నామినేట్ చేశారు. నిబంధనల ప్రకారం పీసీఐలో 28 మంది సభ్యులు ఉండాలి. వారిలో ముగ్గురు లోక్సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు అయ్యుండాలి. లోక్సభ సభ్యులను లోక్సభ స్పీకర్, రాజ్యసభ సభ్యులను రాజ్యసభ అధ్యక్షుడైన ఉప రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.