ప్రధానిగా మోదీ భేష్: అద్వానీ

2 Oct, 2014 03:26 IST|Sakshi
ప్రధానిగా మోదీ భేష్: అద్వానీ

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రధానిగా మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని, మోదీతో పాటు, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా చాలా బాగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నారు. ‘నరేంద్ర భాయి ప్రధానిగా గొప్ప బాధ్యతతో పనిచేస్తున్నారని గర్వంగా చెబుతున్నా.

దేశంలో సజావుగా పాలన సాగించడమొక్కటే ప్రధాని విధి కాదు.. ఇతర దేశాలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడం కూడా ముఖ్యమే. ఎన్నికల్లో ప్రజల మనసు గెలిచిన మోదీ.. ఇప్పుడు మొత్తం ప్రపంచం మనసును గెలిచారు’ అని అద్వానీ బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మోదీని ప్రశంసించారు. అయితే, ‘భారతదేశ చరిత్రలో వాజ్‌పేయిజీని మించిన ప్రధాని లేరు. ఆయన పొందిన గౌరవం మరెవరూ పొందలేరు’ అంటూ ముక్తాయించారు.

మరిన్ని వార్తలు