'అలా ఇంకోసారి రిపీటయిందో.. బాగోదు!'

17 Mar, 2016 17:17 IST|Sakshi
'అలా ఇంకోసారి రిపీటయిందో.. బాగోదు!'

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తర్కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి హెచ్చరికలు జారీచేశారు. రిజర్వేషన్ల పేరిట కొద్దిరోజుల కిందట హర్యానాలో జాట్లు చేసిన నానారచ్చ మరోసారి జరగొద్దని, అలా జరిగితే మీదే బాధ్యత అని వారిద్దరికి గట్టిగా చెప్పినట్లు తెలిసింది.

ఓవైపు రిజర్వేషన్ల అంశాన్ని తాము పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ మరోసారి ఉద్యమానికి వారు సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఖత్తర్ తో భేటీ అయ్యారు. గతంలో జరిగిన దుర్ఘటనలు కూడా వారి ముందు మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏం చేసైనా గతంలో జరిగినట్లు జరగకుండా చూసుకోవాలని మాత్రం వారికి గట్టిగా చెప్పారు.

మరిన్ని వార్తలు