ప్యాసింజర్ అరెస్ట్.. 326 సిల్వర్ కాయిన్లు స్వాధీనం

18 Dec, 2016 22:42 IST|Sakshi
ప్యాసింజర్ అరెస్ట్.. 326 సిల్వర్ కాయిన్లు స్వాధీనం

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ)లో సిల్వర్ కాయిన్లతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి వద్ద నుంచి 320 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పోలీసులు తెలిపారు. జే ఖాయిద్ అనే వ్యక్తి ఇండోర్ కు వెళ్లనున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో బ్యాగులు తనిఖీ చేసే సమయంలో అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ అతడి లగేజీని చెక్ చేశారు. 6.1 కేజీల బరువున్న 326 సిల్వర్ కాయిన్లు ఉన్నట్లు డిటెక్టర్ తో గుర్తించారు. ఆ వెంటనే ఖాయిద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది వివరించారు.

మరిన్ని వార్తలు