సుప్రీం కోర్టులో విచారణలు నిలిపివేత

12 May, 2015 15:36 IST|Sakshi
సుప్రీం కోర్టులో విచారణలు నిలిపివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలో భూకంపం సంభవించిన నేపధ్యంలో సుప్రీం కోర్టులో ఈరోజు విచారణలు నిలిపివేశారు. నేపాల్లో పుట్టిన భూకంపం మరోసారి ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కూడా కొద్ది క్షణాలపాటు భూమికంపించింది.  

 ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. భూకంపం కారణంగా మెట్రో రైలు సర్వీసులను కాసేపు నిలిపివేశారు. సుప్రీం కోర్టులో విచారణలు ఈ రోజుకు పూర్తీగా నిలిపివేశారు.

మరిన్ని వార్తలు