సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు!

20 Apr, 2014 15:09 IST|Sakshi
సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ర్యాలీలో సోనియా పాల్గొనడం లేదని  పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా అనారోగ్యానికి గురయ్యారని.. అయితే వివరాలు వెల్లడించడానికి పార్టీ నేతలు నిరాకరించారు. 
 
ఆదివారం ముంబై, ధూలే, నందర్బార్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. సోనియా పర్యటన రద్దు కావడంతో ముంబైలో నిర్వహించే ర్యాలీలో శరద్ పవార్ తో కలిసి రాహుల్ గాంధీ పాల్గొంటారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర ర్యాలీలలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తో కలిసి బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ పాల్గొంటారని పార్టీ తెలిపింది. 
 
మరిన్ని వార్తలు