మోడీ గో బ్యాక్.. చెన్నైలో విద్యార్థుల ధర్నా, లాఠీచార్జి

18 Oct, 2013 11:48 IST|Sakshi
picture tweeted by ANI

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. శుక్రవారం మోడీ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. పోలీసులు ధర్నాను అడ్డుకోవడంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

కాగా నిఘా విభాగాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెన్నై ఎయిర్పోర్టు, బీజీపీ ఆఫీసుకు ఐదంచెల భద్రత కల్పిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ నేడు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు.

మరిన్ని వార్తలు