నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది

7 Oct, 2016 15:28 IST|Sakshi
నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది

న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగింది. ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యపాన నిషేద చట్టాన్ని రద్దు చేస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

'మద్యపాన నిషేధానికి, ప్రాథమిక హక్కులతో సంబంధం ఉంటుందని, అవి రెండు కలిసిసాగుతాయని తాము భావించడం లేదు' అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల(అక్టోబర్) 3న బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లగా దానికి అనుకూలంగా నిర్ణయం వెలువడింది.
 

మరిన్ని వార్తలు