తప్పులో కాలేసిన టీవీ చానల్‌

16 Dec, 2016 17:47 IST|Sakshi
తప్పులో కాలేసిన టీవీ చానల్‌

న్యూఢిల్లీ: టీవీ చానల్‌ ఇండియా టుడేలో కనిపించిన ఓ బ్రేకింగ్ న్యూస్‌ చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. గురువారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా ఇచ్చే క్రమంలో ఇండియా టుడేలో పెద్ద తప్పిదమే దొర్లింది.

పార్లమెంట్‌లో ఎంపీల వ్యవహారశైలి మూలంగా చర్చ జరగకుండా పోతుందని.. దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని టీవీ చానల్‌ ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్‌ కాస్తా.. టైపింగ్‌లో తప్పు దొర్లి, మధ్యలో ఆంగ్ల అక్షరం 'ఈ' చేరడంతో ఎలా మారిందో మీకు కనిపిస్తోంది!

మరిన్ని వార్తలు