'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు'

21 Mar, 2017 15:55 IST|Sakshi
'నా సోదరుడు బలవంతంగా మార్చలేదు'
న్యూఢిల్లీ: ఇస్లాం మతంలోకి మారాలని తన సోదరుడు ఎవరినీ బలవంతపెట్టలేదని ఇస్లాం మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్‌నాయక్‌ సోదరుడు మహ్మద్‌ అబ్దుల్‌ కరీమ్‌ నాయక్‌ చెప్పారు. తన సోదరుడికి భిన్న మతాలపై అవగాహన ఉందని, చాలా కాలంగా ఆయన మతబోధకుడిగా ఉన్నారని, ఆ క్రమంలో ఆయనకు ఎవరితో బలవంతంగా మతమార్పిడులు చేయించలేదని, స్వచ్ఛందంగానే కొంతమంది మతమార్పిడి చేసుకున్నారని తెలిపారు.

జకీర్‌ నాయక్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జకీర్‌కు సంబంధించిన సంస్థల ప్రతినిధులను కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే జకీర్‌ సోదరుడిని మూడుసార్లు ప్రశ్నించిన ఈడీ ఆ మేరకు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. అంతకుముందు జకీర్‌ సోదరిని ఈడీ విచారించింది. 
మరిన్ని వార్తలు