నిర్మాత వడ్డే రమేష్కు సినీ ప్రముఖుల నివాళి

22 Nov, 2013 18:51 IST|Sakshi

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ (66) గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. కేన్సర్ చికిత్స నిమిత్తం కొన్నాళ్లుగా ఆయన కోయంబత్తూరులోనే ఉన్నారు. వ్యాధి తీవ్రత అధికమవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రమేష్‌ని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన గురువారం సాయంత్రం 4.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని శుక్రవారం సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు