4 ఏళ్ల పాలన ఓ వినాశనం : వైఎస్‌ జగన్‌

8 Jun, 2018 20:58 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అ‍న్నారు. శుక్రవారంతో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ మేరకు నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

‘పత్ర్యేక హోదాపై వెన్నుపోటు
యువతకు రాని ఉద్యోగాలు
రైతులకు, స్వయం సహాయక బృందాలకు కాని రుణమాఫీ..
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల నిర్లక్ష్యం
పేదలకు దక్కని ఇళ్లు..
పెట్రోల్‌ ధరలకు పడని కళ్లెం..
అడ్డు అదుపులేని అవినీతి
మాట మీద నిలబడని హామీలు..
సంక్షేమానికి తూట్లు
సొంత డబ్బాకు ప్రాధాన్యం..’

టీడీపీ నాలుగేళ్లలో ఇవే ప్రజలకు చేసిందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మార్పును కోరుకుంటోందని చెప్పారు.

మరిన్ని వార్తలు