మంత్రి బెదిరింపులు.. సీఎం హెచ్చరికలు

16 Nov, 2019 12:07 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కేబినెట్‌ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతిసింగ్‌పై ఇటీవల బెదిరింపు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ పోలీస్‌ అధికారిపై ఆమె ఫోన్‌లో బెదిరిస్తున్న ఆడియో రికార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వాతిసింగ్‌పై  రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఆరా తీసిన సీఎం యోగి.. సదరు మంత్రికి నోటీసులు పంపారు. ఫోన్‌కాల్‌ రికార్డుపై 24 గంటల్లో సీఎం కార్యాలయానికి, డీజీపీకి వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే అధికారులతో హుందాగా వ్యహరించాలని కూడా హెచ్చరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు