సరైన సమయంలో పార్టీపై నిర్ణయం

1 Jan, 2018 02:58 IST|Sakshi

టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం  

మంచిర్యాల క్రైం: పార్టీ ఏర్పాటుపై సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఆదివారం మంచిర్యాలలో రైతు జేఏసీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరుగుతోందని కోదండరాం చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని, రైతుల సమస్యలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకే ప్రత్యే కంగా రైతు టీజేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అసలు రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని కాపాడే పాలకులున్నారా.. లేక దోపిడీదొంగలున్నారా.. అనే అనుమానం కలుగుతోందని అన్నారు. లంబాడీ, ఆదివాసీల వివాదంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు