ఆ విషయంతో మాకేం సంబంధం: కిషన్‌రెడ్డి

7 Jul, 2019 15:20 IST|Sakshi

సాక్షి, అమరావతి : కర్ణాటక సంక్షోభం వెనుక బీజేపీ హస్తం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమకేమీ సంబంధం అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి నేతృత్వంలోని కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. తమ పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వెనుక బీజేపీ పాత్ర ఉందని, బీజేపీ వ్యూహంలో భాగంగానే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై కిషన్‌రెడ్డి స్పందించారు. తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటినుంచో తమ పార్టీలకు రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలిపారు. గతంలోనూ ఆ రెండు పార్టీలు బీజేపీపై ఇదేరకంగా నిందలు వేశారని, నాయకుడు లేని పార్టీ తరహాలో కాంగ్రెస్‌ తయారైందని పేర్కొన్నారు. తాము ఎవరిపైన కక్ష సాధింపుకు దిగబోమన్నారు.

మరిన్ని వార్తలు