మహారాష్ట్రలో మజ్లిస్‌–బీబీఎం పొత్తు

16 Sep, 2018 05:24 IST|Sakshi
బీబీఎం అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు  ఎంఐఎం, భరిపా బహుజన్‌ మహాసంఘ్‌ (బీబీఎం) పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ రెండు పార్టీలు 2019లో జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం వెల్లడించారు.  బీబీఎం అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అక్టోబర్‌ 2న ఔరంగాబాద్‌లో నిర్వహించే ర్యాలీకి తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఆ ర్యాలీలో సంకీర్ణ కూటమి గురించి ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు