మోదీ సర్వేలో విపక్ష కూటమిపై ప్రశ్న

15 Jan, 2019 10:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న మహా కూటమి ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందా?’.. ఈ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీకు సంబంధించిన నమో యాప్‌లో నిర్వహిస్తున్న ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వేలోనిది. దీంతో పాటు పలు ఇతర ప్రశ్నలకు కూడా ఈ సర్వేలో పాల్గొనేవారు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా పౌరులను కోరుతూ ఓ చిన్న వీడియోను తన ట్విటర్‌ హ్యాండిల్‌లో సోమవారం ప్రధాని మోదీ పోస్ట్‌ చేశారు.

‘నమో యాప్‌లో ఓ సర్వే ప్రారంభమైంది. అందులో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నా. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవి మాకు తోడ్పడుతాయి’ అని అందులో మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం, నియోజకవర్గం, అవినీతి రహిత పాలన, స్వచ్ఛభారత్, మౌలిక వసతులు, చవకగా ఆరోగ్యం, ఆర్థిక రంగం, జాతీయ భద్రత, ఉపాధి, గ్రామీణ విద్యుదీకరణ.. తదితరాలపై పలు ప్రశ్నలున్నాయి. 

మరిన్ని వార్తలు