అమరావతిలో రాజధానిని ఎక్కడ నిర్మించావు బాబూ?:మంత్రి పెద్దిరెడ్డి 

14 Jan, 2020 04:43 IST|Sakshi

కర్లపాలెం (బాపట్ల): అమరావతిలో రాజధానిని ఎక్కడ నిర్మించారో చంద్రబాబు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా కర్లపాలెం పంచాయతీ సచివాలయ భవనాన్ని సోమవారం ఆయన, ఉప సభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు రూ.2.37 కోట్ల విలువైన బ్యాంకు చెక్కును అందజేశారు. మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాజధానిని నిర్మిస్తానని చెప్పి ఐదేళ్లలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం మాత్రమే చంద్రబాబు నిర్మించారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు