ప్రియమైన వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు : మోదీ

23 May, 2019 16:10 IST|Sakshi

న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీపీ ప్రభంజనం సృష్టిస్తూ భారీ విజయం దిశగా దూసుకువెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు..‘ ప్రియమైన వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు’ అని తెలుగులో ట్వీట్‌ చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 30 స్థానాల్లో  ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 123 మంది స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు